APSRTC: ఆర్టీసీ ఉద్యోగుల కోసం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

APSRTC: ప్రమాదవశాత్తు ఉద్యోగి చనిపోతే రూ. 40 లక్షల బీమా, వికలాంగులైతే రూ.30 లక్షలు, సహజ మరణానికి రూ.5 లక్షలు

Update: 2021-08-28 06:19 GMT

ఆర్టీసీ ఉద్యోగుల కోసం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

APSRTC: ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కార్పొరేట్ బీమా సౌకర్యం కల్పించింది. ప్రమాదవశాత్తు ఉద్యోగి చనిపోతే 40 లక్షల బీమా సౌకర్యం కల్పించనున్నారు. శాశ్వత వికలాంగులైతే 30 లక్షలు, సహజ మరణానికి 5 లక్షల బీమా వర్తిస్తుంది. ఇందుకోసం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకుంది ప్రభుత్వం. అంతేకాకుండా మరణించిన ఉద్యోగుల పిల్లల విద్యారుణాలు, ఆడపిల్లల వివాహ రుణాల మాఫీ కూడా కల్పించనున్నారు.

Tags:    

Similar News