విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలు రద్దు..ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తవ్వకాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ జిల్లా చింతపల్లి మండలం, అరకు మండలం, అనంతగిరి, గాలికొండ, చింతమగొంది, రక్తకొండలో గత 30 ఏళ్లుగా తవ్వకాలు జరుగుతున్నాయి. ఏపీ ఎండీసీ ఈ తవ్వకాలకు అనుమతులిచ్చింది. దీన్ని రద్దు చేస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.