విశాఖలో పర్యటించిన ఏపీ గవర్నర్
-ఐఐపీఅండ్ఇ 4వ వ్యవస్థాపక దినోత్సవం -ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ గవర్నర్ -విద్యార్థులకు పలు సూచనలు చేసిన గవర్నర్ -ప్రపంచ వ్యాప్తంగా కాలుష్య సమస్య ఉందన్న బిశ్వభూషణ్ -పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని పిలుపు -దేశ నిర్మాణంలో విద్యార్థులదే కీలక పాత్ర
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విశాఖ జిల్లాలో పర్యటించారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ 4వ వ్యవస్థాపక దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై... విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా కాలుష్య సమస్య ఉందని.. దీని వల్ల మానవాళికి ప్రమాదం పొంచి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశ నిర్మాణంలో విద్యార్థులదే ప్రధాన పాత్ర అని గవర్నర్ సూచించారు.