అమరావతి భూముల కేసులో అప్పీల్‌ పిటిషన్‌ వెనక్కి తీసుకున్న ఏపీ సర్కార్

* ఈ కేసు విచారణపై గతంలో స్టే విధించిన హైకోర్టు * హైకోర్టు ఆర్డర్‌ను సవాల్‌ చేస్తూ సుప్రీంను ఆశ్రయించిన జగన్ సర్కార్

Update: 2021-07-22 08:00 GMT

సుప్రీమ్ కోర్ట్ (ఫోటో: ది హన్స్ ఇండియా) 

Andhra Pradesh: అమరావతి భూముల కేసులో అప్పీల్ పిటిషన్‌ను ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ కేసు విచారణపై హైకోర్టు స్టే విధించింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. అయితే మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి కేసు పిటిషన్‌ను ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. రెండ్రోజుల క్రితం ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతికూలంగా సుప్రీం తీర్పువచ్చింది. ఈ నేపథ్యంలోనే దమ్మాలపాటి కేసు పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. 

Tags:    

Similar News