Andhra Pradesh: మూడు రాజధానులపై క్లారిటీ ఇవ్వనున్న ఏపీ సర్కార్

Andhra Pradesh: మూడు రాజధానులపై స్పష్టమైన ప్రకటన చేయనున్న సీఎం జగన్

Update: 2022-03-18 07:15 GMT

మూడు రాజధానులపై క్లారిటీ ఇవ్వనున్న ఏపీ సర్కార్

Andhra Pradesh: ఏపీ మూడు రాజధానుల వివాదంపై సోమవారం ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే అవకాశం కన్పిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లోనే మూడు రాజధానులపై స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. సోమవారంనాడు అసెంబ్లీలో మూడు ప్రాంతాల అభివృద్దిపై సభలో కీలక చర్చ జరగనుంది. అయితే మూడు రాజధానులా లేక మూడు ప్రాంతాల అభివృద్ధా అన్న దానిపై సీఎం జగన్‌ సభలో స్పష్టం చేయనున్నారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్ పూర్తిస్థాయిలో వివరణ ఇస్తారని సమాచారం. 

Tags:    

Similar News