Andhra Pradesh: కోవిడ్ మృతుల అంత్యక్రియలకు రూ.15వేలు సాయం

Update: 2021-05-16 14:11 GMT

corona patient  Funerals

Andhra Pradesh: క‌రోనా మ‌హమ్మారి రాష్ట్రంలో విల‌య‌తాండ‌వం చేస్తుంది. క‌రోనా బారిన ప‌డి మ‌ర‌ణించే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. కరోనాతో మృతి చెందిన వారి మృత‌దేహాల‌ను ప్ర‌భుత్వ‌మే ఖ‌న‌నం చేస్తుంది. మృతుల అంత్యక్రియలకు సంబంధించి సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2021-22 ఏడాదికి గాను కొవిడ్ మృతుల అంత్యక్రియలకు రూ.15 వేలు చొప్పున ఆర్థికసాయం అందించాలని నిర్ణయించారు.

ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు అధికారాలు మంజూరు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొవిడ్ నియంత్రణ, సహాయ చర్యలకు కేటాయించిన నిధుల నుంచి ఈ ఆర్థికసాయం అందజేయాలని కలెక్టర్లకు సూచించారు. ఏపీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఈ నిధులను ఆయా జిల్లాల కలెక్టర్లకు విడుదల చేస్తారని వివరించారు. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వ ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ పేరిట ఉత్తర్వులు జారిచేశారు.

Tags:    

Similar News