ఏపీలో కరోనా కేసులపై హెల్త్ బులిటెన్ రిలీజ్

Update: 2020-03-28 06:59 GMT

ఏపీలో కరోనా కేసులపై హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు. ఏపీలో ఇప్పటివరకు 13 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యిందని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. ఈ రోజు పరీక్షించిన 22 శాంపిల్స్ అన్నీ నెగటివ్ గా నిర్ధారించారు. కొత్తగా ఎలాంటి పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. ఇప్పటి వరకు నమోదైన 13 కేసుల్లో పది కేసులు విదేశాల నుంచి వచ్చిన వారివిగా గుర్తించారు. మరో ముగ్గురు కుటుంబ సభ్యులు, సన్నిహితులుగా గుర్తించారు. కరోనా వైరస్ విస్తరించకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టిందిని పేర్కొన్నారు.

Tags:    

Similar News