Andhra Pradesh: ఆన్‌లైన్‌ టిక్కెట్ల అమ్మకంపై నేడు ఏపీ ప్రభుత్వం సమావేశం

Andhra Pradesh: ఆన్‌లైన్‌ టిక్కెట్ల అమ్మకంపై నేడు ఏపీ ప్రభుత్వం సమావేశం నిర్వహించనుంది.

Update: 2021-09-20 02:52 GMT

సినీ ప్రముఖులతో మీటింగ్ (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: ఆన్‌లైన్‌ టిక్కెట్ల అమ్మకంపై నేడు ఏపీ ప్రభుత్వం సమావేశం నిర్వహించనుంది. సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ ఓనర్లు తదితరులను ప్రభుత్వం సమావేశానికి ఆహ్వానించింది. ఆన్‌లైన్‌లో టికెట్లు అమ్మే అంశంపై అభిప్రాయాలు, సలహాలు తీసుకోనున్నారు. ఆన్‌లైన్ టికెట్ల అమ్మకం సొమ్మును రియల్ టైమ్‌లో ట్రాన్స్‌ఫర్ చేస్తామని స్పష్టం చేయనుంది ప్రభుత్వం. ఏపీ ఎప్డీసీ ద్వారా ఆన్ లైన్ టికెటింగ్ పోర్టల్‌ను నిర్వహించనున్నట్లు సినిమా నిర్మాతలకు ప్రభుత్వం వివరించనుంది. ఇప్పటికే నిర్మాతలు, సినీ ప్రముఖులు థియేటర్ యాజమాన్యాలతో సంప్రదింపులు జరపనుంది ప్రభుత్వం.

Tags:    

Similar News