ఏపీలో 1184 వైద్యుల పోస్టుల భర్తీకి ప్రభుత్వ నోటిఫికేషన్.. దరఖాస్తుకు చివరి తేది ఈనెల 19

Update: 2020-04-17 12:17 GMT

కరోనా నివారణ కోసం ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. అందులోభాగంగా ఏపీలో 1184 వైద్యుల పోస్టుల భర్తీకి ప్రభుత్వ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 19లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ప్రభుత్వ జనరల్‌, జిల్లా ఆస్పత్రుల్లో ఈ వైద్యులను నియమించనున్నారు. ఏడాది ఒప్పంద ప్రాతిపదికన ప్రభుత్వం ఈ నియామకాలు చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 592 జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్లు, 192 మత్తు వైద్యులు, 400 జనరల్‌, పల్మనరీ మెడిసిన్‌ పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. 


Tags:    

Similar News