మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం

Update: 2019-09-15 11:11 GMT

గోదావరిలో లాంచీ ప్రమాద ఘటనపై సీఎం జగన్ మరోసారి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సహాయక కార్యక్రమాల కోసం తీసుకుంటున్న చర్యలపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ముఖ్యమంత్రి ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే బాధిత కుటుంబాలకు అండగా ఉండాలంటూ మంత్రులు, అధికారులను సీఎం ఆదేశించారు. కాగా, లాంచీ మునిగిన ప్రాంతంలో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు జరుగుతున్నాయి. సహాయకచర్యల్లో సుమారు 140 మంది సహాయక సిబ్బంది పాల్గొన్నారు. విశాఖ, ఏలూరు కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబసభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు.

Tags:    

Similar News