ఇసుక కొత్త విధానంలో ఏపీ ప్రభుత్వం మరో నిర్ణయం
ఇసుక కొత్త విధానంలో ఏపీ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఇసుక రవాణా టెండర్లు రద్దు చేస్తున్నట్లు గనుల శాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఇసుక కొత్త విధానంలో ఏపీ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఇసుక రవాణా టెండర్లు రద్దు చేస్తున్నట్లు గనుల శాఖ ఆదేశాలు జారీ చేసింది. కిలోమీటర్ ఇసుక తరలింపునకు అతి తక్కువ ధర ఒక్క రూపాయి 90 పైసలకు కోట్ చేయడంతో అధికారులకు అనుమానం వచ్చింది. మళ్లీ అక్రమాలు జరిగే అవకాశం ఉందంటూ ఇంటెలిజెన్స్ నివేదికలు అందాయి. టీడీపీ వారే ఎక్కువ రీచ్లు దక్కించుకున్నట్లు ప్రభుత్వానికి నివేదిక అందించింది. జిల్లా మొత్తం ఒకే కాంట్రాక్టర్ ఉంటే ఇబ్బందులు వస్తాయని టెండర్లను రద్దు చేశారు. జీపీఎస్ ఉన్న ట్రక్కు యజమానులు దరఖాస్తు చేసుకుంటే వారికి అవకాశం ఇస్తామని వెల్లడించారు.