టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మద్దతుగా ఉండవల్లిలోని ఆయన నివాసానికి రాజధాని ప్రాంత రైతులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. చంద్రబాబు రాజధాని ప్రాంతంలో ఉంటేనే తమకు కొండంత అండ, ధైర్యమని రైతులు తెలిపారు. చంద్రబాబును రాజధాని ప్రాంతం నుంచి ఎక్కడికి వెళ్లనీయబోమన్నారు. చంద్రబాబు ఉండటానికి అవసరమైన స్థలాన్ని తామే ఉచితంగా ఇస్తామని చెప్పారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చి రైతులు ఎంతో అండగా నిలిచారని అన్నారు చంద్రబాబు.