ఏపీలో ఎట్టకేలకు ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. రేపటి నుంచి విద్యార్థులు కళాశాలలకు ఆప్షన్లు ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు. ర్యాంకుల వారీగా ఆప్షన్ల ఎంపికకు ఉన్నత విద్యా మండలి తేదీలు ప్రకటించింది. 1 నుంచి 35వేల ర్యాంకు వరకు ఈనెల 27, 28న వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. 35,001 నుంచి 80 వేల వరకు ఈ నెల 29, 30న.. 80,001 నుంచి చివరి ర్యాంకు వరకు జులై 31, ఆగస్ట్ 1న వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. ఆగస్ట్ 2న వెబ్ఆప్షన్లు మార్చుకునేందుకు వీలు కల్పించింది. అనంతరం ఆగస్ట్ 4న సీట్లు కేటాయించనున్నారు. ఆగస్ట్ 5 నుంచి ఇంజినీరింగ్ తరగతులు ప్రారంభం కానున్నాయి. కళాశాలల్లో విద్యార్థులు రిపోర్టు చేసేందుకు చివరి తేదీ ఆగస్ట్ 8గా ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. అన్ని ఇంజినీరింగ్ కళాశాలల్లో గత ఏడాది ఫీజులే వర్తిస్తాయి.