డ్రోన్ వివాదంపై స్పందించిన ఏపీ డీజీపీ సవాంగ్‌

Update: 2019-08-19 09:53 GMT

కృష్ణా కరకట్టపై చంద్రబాబు ఇంటి పరిసరాల్లో డ్రోన్ వినియోగం వివాదంపై ఏపీ డీజీపీ సవాంగ్‌ స్పందించారు. వరద పరిస్థితిపై అంచనా కోసమే ఇరిగేషన్ శాఖ డ్రోన్ ఉపయోగించిందన్న సవాంగ్‌ లోకల్ పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడంతోనే కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందన్నారు. చంద్రబాబు ఇంటి దగ్గర డ్రోన్ వినియోగంలో ఎలాంటి కుట్ర లేదన్న డీజీపీ దీనిపై రాజకీయం చేయొద్దన్నారు. ఇరిగేషన్ అధికారులు, స్థానిక పోలీసులకు మధ్య సమన్వయంలేకే ఈ వివాదం ఏర్పడందన్న ఏపీ డీజీపీ సవాంగ్‌ ఇకపై డ్రోన్ ఎవరు వినియోగించినా అనుమతి తప్పనిసరి అన్నారు.

Tags:    

Similar News