సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో కీలక నిర్ణయం దిశగా ఆలోచిస్తున్నారు. వైఎస్ హయాంలో మాదిరిగా ప్రాంతీయ డెవలప్మెంట్ బోర్డుల ఏర్పాటుకు పరిశీలిస్తున్నారు. మొత్తం 5 ప్రాంతీయ మండళ్లు ఏర్పాటు చేయాలనుకుంటోన్న ప్రభుత్వం ఐదు బోర్డులకు ఐదుగురు ఛైర్మన్లను నియమించాలని భావిస్తోంది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, కృష్ణా-గుంటూరు, ప్రకాశం-నెల్లూరు, రాయలసీమ బోర్డులు చేయనుంది.