2017-18 కాగ్ నివేదికను జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అయితే గత ప్రభుత్వం పరిమితికి మించి అప్పులు చేసిందంటూ కాగ్ ఏకిపారేసింది. జీఎస్డీపీలో 25.9 శాతానికి లోపే అప్పులు చేయాల్సి ఉండగా, కానీ 32.30శాతం అప్పులు చేశారని కాగ్ మండిపడింది. అంతేకాదు ఒక్క ఏడాదిలోనే 80వేల కోట్లకు పైగా అప్పు చేశారని కాగ్ తన నివేదికలో పేర్కొంది.