YS Jagan: ఇడుపులపాయకు చేరుకున్న సీఎం జగన్

*ఈరోజు రాత్రి ఇడుపులపాయ గెస్ట్‌ హౌస్‌లో బస *రేపు ఉదయం వైఎస్సాఆర్‌కి నివాళులు అర్పించనున్న జగన్

Update: 2021-12-23 13:47 GMT

సీఎం జగన్ (ఫోటో: ది హన్స్ ఇండియా)

YS Jagan: కడపలో పర్యటిస్తున్న సీఎం జగన్ ఇడుపులపాయకు చేరుకున్నారు. ఈరోజు రాత్రి ఇడుపులపాయ గెస్ట్‌ హౌస్‌లోనే ముఖ్యమంత్రి బస చేయనున్నారు. రేపు ఉదయం 9.00గంటలకు దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి జగన్ నివాళులు అర్పించనున్నారు. అనంతరం కుటుంబసభ్యులతో కలిసి ఇడుపులపాయ నెమళ్ల పార్క్‌ సమీపంలోని మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. అనంతరం పులివెందులకు వెళ్లి పలు కార్యక్రమాల్లో సీఎం జగన్ పాల్గొననున్నారు.

Tags:    

Similar News