సీఎం జగన్ వచ్చే నెల మొదటి వారం నుంచి ప్రజాదర్బార్ నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి రోజూ ఉదయం 30 నిమిషాల పాటు ప్రజలతో ముఖాముఖీ నిర్వహిస్తారు. ప్రజాదర్బార్లో ప్రజల నుంచి విన్నపాలు స్వీకరిస్తారు. వారి నుంచి వినతులను స్వీకరించి అక్కడికక్కడే పరిష్కారం అయ్యే సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటిని సంబంధితత శాఖ అధికారులకు పంపుతారు. ఇక సీఎం జగన్ తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కూడా ఇదే రకంగా సామాన్యులు తనను కలుసుకునేందుకు అవకాశం కల్పించారు. ప్రతి రోజు ఉదయం కొంతసేపు సామాన్యులను కలుసుకుని వారి సమస్యలు విన్న వైఎస్ఆర్ వాటికి పరిష్కారం చూపించాలని అధికారులను ఆదేశించేవారు.