సీఎం జగన్ మూడు రోజుల పర్యటన వివరాలు ఇవే..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రోజుల పర్యటనలో భాగంగా కడప జిల్లాకు వెళ్లారు.

Update: 2019-12-23 05:36 GMT
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రోజుల పర్యటనలో భాగంగా కడప జిల్లాకు వెళ్లారు. అక్కడే క్రిస్మస్ పండగ జరుపుకొంటారు. సీఎం మూడు పర్యటన వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.

♦ 1.35 గంటలకు దువ్వూరు మండలం నేలటూరు గ్రామానికి చేరుకుంటారు.

♦ 1.45 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాల అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు.

♦ 3.40 గంటలకు కడప రిమ్స్‌కు వెళతారు.

♦ 3.55 నుంచి 4.05 గంటల వరకు కడపలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు.

♦  4.15 గంటలకు వైఎస్సార్‌ ఉచిత భోజన, వసతి భవనం వద్దకు చేరుకుంటారు. సాయంత్రం 4.25 గంటలకు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.

♦ 4.45 గంటలకు కడప–రాయచోటి మార్గంలోని రైల్వే ఓవర్‌ బ్రిడ్జి వద్దకు చేరుకుంటారు. 4.50 నుంచి 5.00 గంటల వరకు అక్కడి రైల్వే ఓవర్‌ బ్రిడ్జిని ప్రారంభిస్తారు.

♦ సాయంత్రం 5.55 గంటలకు పులివెందుల నియోజకవర్గం ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు.

   24వ తేది కార్యక్రమాలు

♦ ఉదయం 9.10 నుంచి 9.40 గంటల వరకు దివంగత ముఖ్యమంత్రి, ఆయన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధి ఘాట్‌ వద్ద నివాళులు అర్పిస్తారు.

♦ 9.55 గంటలకు అక్కడున్న చర్చి వద్దకు వెళతారు.

♦ 10.00 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు అక్కడ ప్రార్ధనలు నిర్వహిస్తారు.

♦ 1.40 గంటలకు హెలికాఫ్టర్‌లో బయలుదేరి 2.00 గంటలకు రాయచోటి జూనియర్‌ కళాశాల గ్రౌండ్‌ వద్దకు చేరుకుంటారు.

♦ మధ్యాహ్నం 2.15 నుంచి 4.15 గంటల వరకు రాయచోటి నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు.. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో         పాల్గొంటారు.

♦ 5.10 గంటలకు తిరిగి ఇడుపులపాయలోని గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు.

    25వ తేది కార్యక్రమాలు

♦ ఉదయం 9.30 గంటలకు పులివెందులలోని భాకరాపురం హెలిప్యాడ్‌లో దిగుతారు.

♦ 9.45 గంటలకు సీఎస్‌ఐ చర్చికి చేరుకుంటారు. 9.50 నుంచి 11.10 గంటల వరకు క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొంటారు.

♦ 11.25 నుంచి 12.10 గంటల వరకు పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అలాగే వైఎస్సార్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను      ప్రారంభిస్తారు.

♦ 12.30 గంటలకు భాకరాపురంలోని తన నివాసానికి చేరుకుంటారు.

♦ 2.35 గంటలకు హెలికాఫ్టర్‌లో బయలుదేరి 3.00 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 3.10 గంటలకు ఎయిర్‌పోర్టులో విమానంలో బయలుదేరి 4.00 గంటలకు               గన్నవరం వెళతారు. 4.30 గంటలకు తాడేపల్లిలో తన నివాసానికి చేరుకుంటారు.

Tags:    

Similar News