ఇవాళ ఢిల్లీకి ఏపీ సీఎం జగన్.. ప్రధానితో భేటీ.. అందుకేనా..?

YS Jagan - Delhi Tour: జూడిషియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో పాల్గొననున్న జగన్...

Update: 2022-04-29 01:30 GMT

ఇవాళ ఢిల్లీకి ఏపీ సీఎం జగన్.. ప్రధానితో భేటీ.. అందుకేనా..?

YS Jagan - Delhi Tour: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీ వెళ్తారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడితో సీఎం భేటీ కానున్నారు. నెల రోజుల వ్యవధిలోనే ప్రధాని మోడీలతో మరోసారి జగన్ సమావేశం కానుండటం ఆసక్తికరంగా మారింది. ఈసారి ప్రధానితో భేటీలో ప్రధానంగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు, కేంద్రం నుంచి తోడ్పాటు అవకాశంపై చర్చించనున్నట్లు తెలిసింది.

దీంతో పాటు పోలవరం ప్రాజెక్టు గురించి చర్చించనున్నారు. ఈనెల 30న న్యూఢిల్లీలో జరిగే జూడిషియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో సీఎం జగన్ పాల్గొంటారు. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, పలు రాష్ట్రాల సీఎంలు పాల్గొంటున్నారు. దేశంలో న్యాయ మౌలిక సదుపాయాల కల్పన, కేసుల సత్వర పరిష్కారంపై సెమినార్ నిర్వహించనున్నారు.

Tags:    

Similar News