అమరావతిపై క్లారిటీ.. కాసేపట్లో..
సీఆర్డీఏ అధికారులతో సీఎం జగన్ సమీక్ష కొనసాగుతోంది. ఏపీ రాజధానితో పాటు సీఆర్డీఏ పరిధిలోని పలు అంశాలపై అధికారులతో సీఎం చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాజధాని అంశంపై రాజకీయంగా రగడ కొనసాగుతున్న నేపధ్యంలో ఈ భేటీ ప్రధాన్యతను సంతరించుకుంది.
సీఆర్డీఏ అధికారులతో సీఎం జగన్ సమీక్ష కొనసాగుతోంది. ఏపీ రాజధానితో పాటు సీఆర్డీఏ పరిధిలోని పలు అంశాలపై అధికారులతో సీఎం చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాజధాని అంశంపై రాజకీయంగా రగడ కొనసాగుతున్న నేపధ్యంలో ఈ భేటీ ప్రధాన్యతను సంతరించుకుంది. అయితే, అధికారులతో సమీక్ష అనంతరం, జగన్ రాజధానిపై ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. సీఎంతో భేటీకి ముందే సీఆర్డీఏ అధికారులతో మంత్రి బొత్స సమీక్ష నిర్వహించారు. అమరావతిలో ఇప్పటి వరకూ జరిగిన నిర్మాణాలు, ఆర్థికపరమైన అంశాలపై చర్చించారు.