ఏపీ అసెంబ్లీలో మరోసారి రగడ..జగన్ వ్యాఖ్యలతో ఆందోళనకు దిగిన టీడీపీ

Update: 2019-07-25 09:49 GMT

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ మరోసారి అట్టుడికింది. గోదావరి జలాలపై చర్చ సందర్భంగా అధికార-ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చంద్రబాబుకు బుద్ధి జ్ఞానం లేదంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించడంతో టీడీపీ ఆందోళనకు దిగింది. దాంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. అయితే తెలుగుదేశం సభ‌్యులు పోడియంను చుట్టుముట్టడంతో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్‌ సస్పెన్షన్ వేటేశారు.

Tags:    

Similar News