వైఎస్సార్ భౌతికంగా దూరమైన పథకాల రూపంలో బతికే ఉన్నారంటూ ఆయన తనయుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. వైఎస్సార్ ఇచ్చిన స్పూర్తి విలువల బాటలో నడిపిస్తూనే ఉంటుందన్నారు. పరిపాలన, ప్రజా సంక్షేమం విషయంలో వైఎస్సార్ నిర్ణయాలు దేశానికే మార్గదర్శకంగా ఉన్నాయన్నారు. వైఎస్సార్ రాష్ట్రాన్ని నడిపించిన తీరు జాతీయ స్దాయిలో గర్వపడేలా ఉందంటూ ట్వీట్ చేశారు.
పరిపాలన, ప్రజాసంక్షేమం విషయంలో నాన్న నిర్ణయాలు మొత్తం దేశానికే మార్గదర్శకాలయ్యాయి. రాష్ట్రాన్ని నాన్న నడిపించిన తీరు జాతీయస్థాయిలో మనల్ని ఎంతో గర్వించేలా చేసింది.నాన్న భౌతికంగా దూరమైనా పథకాల రూపంలో బతికే ఉన్నారు. ఆయనిచ్చిన స్ఫూర్తి మనల్ని ఎప్పటికీ విలువలబాటలో నడిపిస్తూనే ఉంటుంది.
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 2, 2019