ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. దాదాపు నాలుగు నెలల తర్వాత జగన్ ఢిల్లీ వెళ్లబోతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిమాణాలతో ఈ టూర్పై ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఏపీ ముఖ్యమంత్రి భేటీ అవుతారని తెలుస్తోంది. షాతో భేటీ అనంతరం పలువురు కేంద్ర మంత్రులు, కీలక అధికారులతో జగన్ భేటీ కానున్నారని తెలియవచ్చింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న వ్యవహారాలపై ఢిల్లీ పెద్దలతో చర్చించనున్నారు.