ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక మొట్టమొదటి సారిగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ముఖ్యాంశాలు ఎప్పటికప్పుడు మీకోసం..
60ఏళ్లు పైబడినవారే ఈ వైరస్ తో చనిపోతున్నారు. ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ వైరస్ సోకితే ప్రమాదంగా మారుతుంది. ఇంతదానికి ప్యానిక్ బటన్ నొక్కాల్సిన అవసరమేంటి..? పాజిటివ్ కేసుల్లో 80శాతం ఇంట్లోనే నయమవుతున్నాయి. కేవలం 4.7శాతమే క్రిటికల్ కేసులు. కరోనాపై జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎవరికి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం : సీఎం జగన్
ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు ఏపీ ప్రజలు చింతించాలి.. చంద్రబాబు దగ్గరుండి వ్యవస్థల్ని దిగజార్చారు : సీఎం జగన్
ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు ఇక సీఎంలు ఎందుకు.. ప్రభుత్వాలు ఎందుకు.. అన్నీ ఈసీనే చేసుకోవచ్చుగా: సీఎం జగన్
కలెక్టర్లు, ఎస్పీలకను ఏకపక్షంగా ఎలా తప్పిస్తారు ... అధికారులను బదిలీ చేసి అధికారం ఈసీకి ఎక్కడిది
కరోనా సాకుచూపి ఎన్నికలు వాయిదా వేస్తారా.. ఇష్టమొచ్చినట్టు ఎన్నికలను వాయిదా వేస్తారా : సీఎం జగన్
నిమ్మగడ్డ రమేష్ చేసిన వ్యాఖ్యలు బాధ కలిగిస్తున్నాయి : సీఎం జగన్
రాష్ట్రాల ఎన్నికల కమిషనర్ తన విచక్షణ కోల్పోయారు : సీఎం జగన్