YS Jagan: 14 మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి సీఎం జగన్‌ శంకుస్థాపన

YS Jagan: ఏపీ ప్రభుత్వం వైద్యరంగంపై ప్రత్యేక దృష్టి సారించింది.

Update: 2021-05-31 07:03 GMT

YS Jagan: 14 మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి సీఎం జగన్‌ శంకుస్థాపన

YS Jagan: ఏపీ ప్రభుత్వం వైద్యరంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒకేసారి 16 మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేయాలనుకున్న జగన్‌.. ఇప్పటికే పాడేరు, పులివెందుల మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇక మిగిలిన 14 మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి ఇవాళ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శంకుస్థాపన చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానం ద్వారా పిడుగురాళ్ల, మచిలీపట్నం, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, బాపట్ల, మార్కాపురం, మదనపల్లె, పెనుకొండ, నంద్యాల, ఆదోనిలో ఏర్పాటు చేయనున్న కాలేజీలకు సీఎం శంకుస్థాపన చేశారు.

Tags:    

Similar News