కొత్త జిల్లాలపై జగన్ సర్కారు కసరత్తు ప్రారంభించింది. గతంలో ప్రకటించినట్లుగానే ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల నుంచి 25 జిల్లాలుగా పెంచబోతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. సెప్టెంబర్ 15 కల్లా జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది. ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా మారుస్తామని గతంలో ప్రకటించిన ప్రభుత్వం అందుకు తగ్గట్లుగా కసరత్తు చేస్తోంది.