YS Jagan: కాపుల్లో ఉన్న నిరుపేదల కోసమే వైఎస్‌ఆర్ కాపు నేస్తం

YS Jagan: కాపుల్లో ఉన్న నిరుపేదలకు వైఎస్‌ఆర్ కాపు నేస్తం అండగా ఉంటుందని సీఎం వైఎస్ జగన్ అన్నారు.

Update: 2021-07-22 09:45 GMT

YS Jagan: కాపుల్లో ఉన్న నిరుపేదల కోసమే వైఎస్‌ఆర్ కాపు నేస్తం

YS Jagan: కాపుల్లో ఉన్న నిరుపేదలకు వైఎస్‌ఆర్ కాపు నేస్తం అండగా ఉంటుందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల మహిళలకు ఆర్ధిక సాయం చేస్తున్నామని తెలిపారు. కాపు మహిళల అభివృద్ధి కోసమే ఈ పథకాన్ని తీసుకోచ్చమని సీఎం అన్నారు. ఈ పథకంలో భాగంగా ఏపీ ప్రభుత్వం రెండో ఏడాది నిధులను విడుదల చేసింది. 3.27 లక్షలమంది బ్యాంకు ఖాతాల్లో 490.86 కోట్లను జమా చేశారు. అర్హులైన కాపు మహిళలకు ఏటా రూ.15 వేలు ఆర్ధిక సాయం, ఐదేళ్లలో మొత్తం రూ.75 వేల ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వెనక్కి తగ్గకుండా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

Tags:    

Similar News