కలెక్టర్లకు జగన్ డెడ్ లైన్

Update: 2019-08-13 10:25 GMT

చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రానికి కృష్ణాజలాలు వస్తున్నాయని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కృష్ణా పరివాహక రిజర్వాయర్లన్నీ పూర్తిగా నింపాలని రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల కలెక్టర్లకు ఆదేశించారు. వచ్చే నెల రోజుల్లోనే ఈ పని పూర్తిచేయాలని స్పష్టం చేశారు. వరదలు తగ్గుముఖం పట్టిన గోదావరి పరివాహక ప్రాంతాల్లో వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరువుకు సంబంధించిన ఎలాంటి సహాయం కావాలన్నా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని దానికి సంబంధించిన ప్రతిపాదనలు పంపిన వెంటనే తగిన సహాయం అందిస్తామన్నారు. సెప్టెంబరు నుంచి జిల్లాల్లో పర్యటిస్తానన్న జగన్‌ వచ్చే ఉగాది నాటికి రాష్ట్రంలో ఇంటి స్థలం లేని వాళ్లు ఉండకూడదన్నారు. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని దగ్గరగా ఉండే స్థలాన్ని ఇళ్లస్థలాల కోసం ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. 

Tags:    

Similar News