నామినేటెడ్ పోస్టుల భర్తీపై దృష్టి సారించిన సీఎం జగన్..వారికి తొలి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం...
ఒకే సారి 25 మందితో కేబినెట్ ఏర్పాటు చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్ నామినేటెడ్ పోస్టుల భర్తీపై దృష్టి సారించారు. చివరి వరకు మంత్రి పదవులు ఆశించిన పలువురు ఎమ్మెల్యేలకు కీలకమైన నామినేటెడ్ పోస్టులను కట్టబెట్టాలని జగన్ భావిస్తున్నారు. ఫైర్ బ్రాండ్ రోజాతో పాటు ఆర్కే, అంబటి, కాకాణి, భూమన, కొలగొట్ల, సామినేని పేర్లను జగన్ పరిశీలిస్తున్నారు. జిల్లాల వారిగా సీనియర్ నేతల జాబితాలను పరిశీలిస్తున్న జగన్ అనుభవం, విధేయత, సామాజిక సమీకరణాలను బట్టి పదవులు కట్టబెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు.