AP Cabinet: 29న ఏపీ కేబినెట్‌ సమావేశం..

*అసెంబ్లీ సమావేశాలు, ఇతర అంశాలపై చర్చించే అవకాశం

Update: 2022-08-23 02:35 GMT

AP Cabinet: 29న ఏపీ కేబినెట్‌ సమావేశం..

AP Cabinet: ఈ నెల 29న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని శాఖలకు జీఏడి సమాచారం అందించింది. అయితే, వచ్చే ఎన్నికలకు సిద్దం అవుతన్న ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా నియోజకవర్గాలకు..సచివాలయాల కు నిధుల మంజూరు పైన అధికారికంగా ఆమోద ముద్ర వేయనున్నారు. జూన్‌ 24 న చివరిసారిగా జరిగిన భేటీలో మంత్రివర్గం పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంది.మొత్తం 42 అంశాలపై కేబినెట్‌ భేటీలో చర్చించారు. 29న జరగనున్న భేటీలో కూడా మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకోనన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News