శాసనమండలి పరిణామాల నేపథ్యంలో TDP కీలక నిర్ణయం

నాలుగో రోజు ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు కొనసాగనున్నాయి. రాజధానుల బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిన మండలి చైర్మన్ సభన నిరవధిక వాయిదా వేశారు.

Update: 2020-01-23 04:53 GMT
శాసనమండలి పరిణామాల నేపథ్యంలో టీడీపీ కీలక నిర్ణయం

నాలుగో రోజు ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు కొనసాగనున్నాయి. రాజధానుల బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిన మండలి చైర్మన్ సభన నిరవధిక వాయిదా వేశారు. అయితే శాసనసభ మాత్రం కొనసాగనుంది. శాసనసభలో ఎడ్యుకేషన్ యాక్ట్ సవరణ బిల్లు ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. శాసనమండలిలో బుధవారం జరిగిన పరిణామాలకు నిరసనగా నేటి అసెంబ్లీ సమావేశాలను టీడీపీ బహిష్కరించింది. శాసనసభకు హాజరుకాకూడదని నిర్ణయించింది. ఇదిలా ఉంటే నేడు టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం జరగనుంది. సభలో తమపై జరిగిన దౌర్జన్యం విషయంలో తదుపరి కార్యాచరణపై టీడీఎల్పీ భేటీలో చర్చించనున్నారు.

Tags:    

Similar News