ఏపీ శాసనసభకు సంబంధించిన విలువైన ఫర్నీచర్ మాయం
ఏపీ శాసనసభకు సంబంధించి విలువైన ఫర్మీచర్ మాయమైనట్టు అధికారులు ఆలస్యంగా గుర్తించారు. ఈ విషయంపై తుళ్లూరు పోలీసులకు శాసనసభ కార్యదర్శి మౌఖికంగా ఫిర్యాదు చేశారు.
ఏపీ శాసనసభకు సంబంధించి విలువైన ఫర్మీచర్ మాయమైనట్టు అధికారులు ఆలస్యంగా గుర్తించారు. ఈ విషయంపై తుళ్లూరు పోలీసులకు శాసనసభ కార్యదర్శి మౌఖికంగా ఫిర్యాదు చేశారు. మూడేళ్ల క్రితం హైదరాబాద్ నుంచి అమరావతికి శాసనసభకు సంబంధించిన ఫర్నీచర్ తరలించే సమయంలోనే చేతివాటం చూపించారని తెలుస్తోంది. ఓ లారీ విలువైన ఫర్నీచర్ మార్గమధ్యలోనే మాయమైనట్టు గుర్తించారు. చోరికి గురైందా..? లేక ఎవరైనా దారి మళ్లించి అక్రమాలకు పాల్పడ్డారా అనే విషయంపై అనుమానం వ్యక్తమవుతోంది. అధికారుల ఫిర్యాదు నేపథ్యంలో శాసన సభకు వచ్చిన తుళ్లూరు పోలీసులు శాసన సభాపతి కార్యాలయానికి వచ్చి ప్రాథమిక వివరాలు సేకరించారు.