ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఐదురోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు సాగాయి. 19.25గంటల సభ జరిగింది. 175 మంది సభ్యులు ప్రసంగాలు చేశారు. చివరిరోజు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై సభలో వాడీ వేడి చర్చ జరిగింది. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు సభాపతి తమ్మినేని సీతారాం ప్రకటించారు.