Andhra Pradesh: మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై మరో కేసు నమోదు

Andhra Pradesh: ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారన్న ఆరోపణలపై కేసు * ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారని కేసు

Update: 2021-02-27 05:07 GMT

జేసీ ప్రభాకర్ (ఫైల్ ఇమేజ్ )

Andhra Pradesh: అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై మరో కేసు నమోదు చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లఘించడంతో పాటు ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారన్న ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు రోజుల కిందట బృందావనం అపార్ట్‌మెంట్‌లోని గౌరీనాథ్ రెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో క్రికెట్‌ కిట్లు స్వాధీనం చేసుకున్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి పై ఐసీపీ సెక్షన్ 188, 171 ఈ కింద కేసు నమోదు చేశారు..

మరోవైపు.. తమపై కేసు నమోదు చేయడాన్ని జేసీ వర్గీయులు స్పందించాయి. కక్ష్య సాధింపు చర్యలో భాగంగానే కేసు నమోదు చేశారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో తమ వారిని నామినేషన్ వేయకుండా దౌర్జన్యం చేశారని జేసీ ప్రభాకర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. 

Tags:    

Similar News