ఏపీ వాహనదారులకు షాక్ : భారీగా వాహన జరిమానాల పెంపు

Update: 2020-10-21 13:57 GMT

రోడ్డు ప్రమాదాలను నివారించే దిశగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. వాహనదారులు ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే వారి దిమ్మతిరిగే ఫైన్‌లు విధించాలని నిర్ణయించారు. ఈ మేరకు బుధవారం ఏపీ ప్రభుత్వ పిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేసారు. బైక్ నుంచి 7 సీటర్ కార్ల వరకు జరిమానా అమలు చేయనున్నారు. ఇతర వాహనాలకు మరింత అధిక జరిమానాలు విధించనున్నారు. జరిమానాలు ఇలా..

వాహన చెకింగ్ విధులకు ఆటంకం కలిగిస్తే - రూ. 750.

సమాచారం ఇవ్వడానికి నిరాకరిస్తే - రూ. 750

అనుమతి లేని వ్యక్తులకి వాహనం ఇస్తే - రూ. 5000

అర్హత కంటే తక్కువ వయస్సు వారికి వాహనం ఇస్తే - రూ. 5000

డ్రైవింగ్ లైసెన్స్ పొందే అర్హత లేని వారికి వాహనం ఇస్తే - రూ. 10000

రూల్స్ కి వ్యతిరేకంగా వాహనాల్లో మార్పులు చేస్తే - రూ. 5000

వేగంగా బండి నడిపితే - రూ. 1000

సెల్ ఫోన్ డ్రైవింగ్, ప్రమాదకర డ్రైవింగ్ - రూ. 10000

రేసింగ్ మొదటిసారి రూ. 5000, రెండో సారి రూ. 10000

రిజిస్ట్రేషన్ లేకున్నా, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకున్నా - మొదటిసారి రూ. 2000, రెండో సారి రూ. 5000

పర్మిట్ లేని వాహనాలు వాడితే - రూ. 10000

ఓవర్ లోడ్ - రూ.20000 ఆపై టన్నులు రూ. 2000 అదనం

వాహనం బరువు చెకింగ్ కోసం ఆపక పోయినా - రూ. 40000

ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకుంటే - రూ. 10000

అనవసరంగా హారన్ మోగించినా - మొదటిసారి రూ. 1000, రెండోసారి రూ. 2000 జరిమానా

రూల్స్ కి వ్యతిరేకంగా మార్పు చేర్పులు చేస్తే తయారీ సంస్థలకు లేదా డీలర్లకు, అమ్మినినవారికి - రూ. లక్ష జరిమానా విధించనున్నారు.

Tags:    

Similar News