జగన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం

మరో బృహత్తర కార్యక్రమానికి జగన్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్‌ సమగ్ర భూ సర్వేకు శ్రీకారం చుట్టనున్నట్టు మంత్రి కన్నబాబు వెల్లడించారు. జనవరి 1న భూ సర్వే ప్రారంభం కానున్నట్టు ఆయన ప్రకటించారు.

Update: 2020-11-05 15:03 GMT

మరో బృహత్తర కార్యక్రమానికి జగన్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్‌ సమగ్ర భూ సర్వేకు శ్రీకారం చుట్టనున్నట్టు మంత్రి కన్నబాబు వెల్లడించారు. జనవరి 1న భూ సర్వే ప్రారంభం కానున్నట్టు ఆయన ప్రకటించారు. 15వేల మంది సర్వేయర్లతో వ్యవసాయ భూములతో పాటు రాష్ట్రంలోని అన్ని భూములను రీ సర్వే చేపట్టనున్నట్టు మంత్రి స్పష్టం చేశారు. భూ వివాదాల పరిష్కారానికై ప్రతి మండలంలో మొబైల్‌ కోర్టు ఏర్పాటు చేస్తున్నామన్న మంత్రి.. భూ వివాదాలకు చెక్‌ పెట్టాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

Tags:    

Similar News