ఏలూరులో పర్యటిస్తున్న సీఎం జగన్‌

సీఎం జగన్‌ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పర్యటిస్తున్నారు. అస్వస్థతకు గురైన బాధితులను జగన్‌ పరామర్శించారు. అనంతరం అధికారులతో భేటీ అయ్యారు. ఏలూరులో పరిస్థితులపై చర్చిస్తున్నారు

Update: 2020-12-07 06:11 GMT

సీఎం జగన్‌ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పర్యటిస్తున్నారు. అస్వస్థతకు గురైన బాధితులను జగన్‌ పరామర్శించారు. అనంతరం అధికారులతో భేటీ అయ్యారు. ఏలూరులో పరిస్థితులపై చర్చిస్తున్నారు. బాధితులకు అందుతున్న చికిత్సపై ఆరా తీశారు. మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. అవసరమైతే అదనపు వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు.అస్వస్థతకు గురైన ప్రాంతాల్లో చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఘటనకు గల కారణాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. తాగునీరు కారణమా..? లేక గాలి కాలుష్యమా.? అన్న దానిపై అధికారులను వివరాలు అడిగారు సీఎం జగన్‌.

Tags:    

Similar News