ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం

ఏపీ క్యాబినెట్ ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Update: 2020-11-05 09:57 GMT

Andhra Pradesh Cabinet Meeting Over : ఏపీ క్యాబినెట్ ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చిరు వ్యాపారులకు జగనన్న తోడు పథకం కింద సాయం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకోసం చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. మచిలీపట్నం పోర్టు డీపీఆర్‌కు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రంలోని భూముల రీసర్వే ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. విజయనగరం జిల్లా గాజుల రేగలో మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం 80 ఎకరాలు.. విశాఖ పాడేరు మెడికల్ కాలేజీకి 35 ఎకరాల భూమి ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

Tags:    

Similar News