Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుకు కరోనా పాజిటివ్

Chandrababu: అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా

Update: 2022-01-18 03:23 GMT

 టీడీపీ అధినేత చంద్రబాబుకు కరోనా పాజిటివ్

Chandrababu: తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. అనేక మంది రాజకీయ నాయకులు, ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుకు కరోనా నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలు ఉన్నట్లు చంద్రబాబు ట్వీట్ చేశారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నానని, ఇటీవల తనను కలిసిన వారంతా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని చెప్పారు. సోమవారం చంద్రబాబు కుమారుడు లోకేష్‌కు కూడా కరోనా సోకింది. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని లోకేష్ తెలిపారు.

Tags:    

Similar News