మెడికల్ కాలేజీ స్థలాన్ని పరిశీలించిన మంత్రి ఆళ్లనాని

Update: 2020-06-03 08:18 GMT

ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని పాడేరులో ఏర్పాటు చేసే మెడికల్ కాలేజీ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నాని మాట్లాడుతూ పేదలందరికీ వైద్యం అందుబాటులో తెచ్చే విధంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. వెయ్యి రూపాయలకు మించి జరిపే వైద్య సేవలను ఆరోగ్య శ్రీ కి జతచేశామన్నారు.

ఈ అవకాశాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. మంత్రి వెంట మంత్రి అవంతి శ్రీనివాసరావు, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలఓి్మ, మాజీ మంత్రి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.    


Tags:    

Similar News