డాక్టర్లు ఇళ్ళ వద్దకు వచ్చి కరోనా వైరస్ టెస్టులు నిర్వహిస్తారు : ఏపీ వైద్య ఆరోగ్య శాఖ

కరోనా వైరస్ పరీక్షలు వైద్యులు ఇళ్ళ వద్దకే వచ్చి ఉచితంగా నిర్వహిస్తారని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

Update: 2020-04-15 10:11 GMT

కరోనా వైరస్ పరీక్షలు వైద్యులు ఇళ్ళ వద్దకే వచ్చి ఉచితంగా నిర్వహిస్తారని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.ప్రజలు ఎవరూ అపోహలకు గురికావద్దు తెలిపింది. ప్రజలు శాంపిల్స్ ధైర్యంగా ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ కోరింది.

చుట్టుపక్కల అనుమానితుల వివరాలను తెలియజేసి వారిని కూడా పరీక్షించేలా సహకరించాలని విజ్ఞప్తి చేసింది. పరీక్షించిన తర్వాత క్వారంటైన్ సెంటర్ కు గాని, ఆస్పత్రికి గాని తీసుకెళ్లారని, ఇంటివద్దే తగిన సూచనలు చేస్తారని తెలిపింది. అవసరమైన అవసరమైన మందులు కూడా ఉచితంగా ఇస్తారని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. వైఎస్ఆర్ టెలీ మెడిసిన్ ను కూడా అందుబాటులోకి తెచ్చింది. అవసరమైతే ఈ సౌకర్యాన్ని కూడా మీరు వినియోగించుకోవచ్చు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు.

Tags:    

Similar News