ఏపీలో జిల్లా పరిషత్‌ ఛైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు

Update: 2020-03-06 10:27 GMT
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (ఫైల్ ఫోటో)

జిల్లా పరిషత్ ల రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 13 జిల్లాల రిజర్వేషన్లు ఖరారు చేస్తూ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. మహిళలకు పెద్దపీట వేశారు. ఎనిమిది జిల్లాల్లో మహిళలే జెడ్పీ చైర్ పర్సన్‌లు కాబోతున్నారు. జిల్లాల వారీగా రిజర్వేషన్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం పంపనుంది.

జిల్లాల వారిగా రిజర్వేషన్లు...

1 ) అనంతపురం : బీసీ మహిళ

2) చిత్తూరు : జనరల్‌

3) తూర్పుగోదావరి : ఎస్సీ

4) గుంటూరు : ఎస్సీ మహిళ

5) కృష్ణా జనరల్‌ : మహిళ

6) కర్నూలు : జనరల్‌

7) ప్రకాశం : జనరల్‌ మహిళ

8) నెల్లూరు : జనరల్‌ మహిళ

9) శ్రీకాకుళం : బీసీ మహిళ

10) విశాఖపట్నం : ఎస్టీ మహిళ

11) విజయనగరం : జనరల్‌

12: పశ్చిమ గోదావరి : బీసీ

13) కడప : జనరల్‌

Tags:    

Similar News