లాక్ డౌన్ పొడిగింపుపై ఏపీ సీఎం కీలక వ్యాఖ్యలు
కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదివారం తాడేపల్లిలో సమీక్ష నిర్వహించారు.
కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదివారం తాడేపల్లిలో సమీక్ష నిర్వహించారు.ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కరోనా వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన మరిన్ని చర్య లు, లాక్డౌన్ నేపథ్యంలో నిత్యావసరాల పంపిణీ, సమావేశంలో చర్చించారు.
ఈ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ..లాక్ డౌన్ పొడిగింపుపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. లాక్ డౌన్ పూర్తిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాల బట్టి తగిన చర్యలు తీసుకోవడంపై సమాయత్తం కావాలని అధికారులను సీఎం ఆదేశించారు.
రాష్ట్రంలోని ప్రతి ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కోవిడ్ సంబంధిత లక్షణాలతో ఆసుపత్రికి ఎవరొచ్చినా.. కరోనా బాధితులిగానే గుర్తించి చికిత్స అందించాలని సీఎం ఆదేశించారు. దీనిపై గతంలోనే జారీ చేసిన మార్గదర్శకాలను పాటించేలా చూడాలన్నారు.
ప్రతి జిల్లాలో ఒక టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. అలాగే ఇప్పుడున్న ల్యాబ్ల సామర్థ్యాన్ని కూడా పెంచాలని సూచించారు. అలాగే ఢిల్లీలో జమాత్ మర్కాజ్ కు వెళ్లినవారు, వారితో కాంటాక్ట్ అయిన వారికి పరీక్షలు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిపై నిరంతరాయంగా సర్వే చేయాలని అన్నారు.