రేపు సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం

Amaravati: మధ్యాహ్నం 3 గం.లకు అమరావతి సచివాలయం మొదటి బ్లాకులో భేటీ

Update: 2022-05-11 02:15 GMT

రేపు సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం

Amaravati: రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. గురువారం మధ్యాహ్నం 3 గం.లకు అమరావతి సచివాలయం మొదటి బ్లాకులో ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ అన్ని శాఖల కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల 13 వతేది ఉ.11గం.లకు రాష్ట్ర మంత్రివర్గం భేటీ జరగాల్సి ఉంది. అయితే, అనివార్య కారణాలతో మంత్రివర్గ సమావేశాన్ని ఒకరోజు ముందుగానే అంటే 12వ తేదీన మధ్యాహ్నం 3గం.లకు మార్చారు.

Tags:    

Similar News