ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. మొత్తం 14రోజులపాటు బడ్జెట్ సమావేశాలు జరగగా, 78గంటల 35నిమిషాలు సభ కొనసాగింది. ప్రభుత్వం 20 బిల్లులను ప్రవేశపెట్టగా 19 కీలక బిల్లులను సభ ఆమోదించింది.
ఈ బడ్జెట్ సమావేశాలు చరిత్రాత్మకమైనవని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఎన్నడూ లేనివిధంగా బిల్లులపై సుదీర్ఘ చర్చ జరిగిందన్నారు. మొత్తం 327 ప్రసంగాలు నమోదైనట్లు తెలిపిన స్పీకర్ ఇలా అర్ధవంతమైన చర్చలు జరగడానికి సహకరించిన సభానాయకుడు జగన్మోహన్రెడ్డిని అభినందిస్తున్నానని అన్నారు.