ఏపీలో ఎట్టిపరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తాం: ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి

Update: 2021-01-22 07:04 GMT

ఏపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి (ఫైల్ ఫోటో)

ఏపీలో ఎట్టిపరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తామన్నారు ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి. ఎన్నికలను బహిష్కరించేందుకు ఉద్యోగ సంఘాలు సిద్ధమవుతున్నాయని వెల్లడించారు. అవసరమైతే సమ్మెకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఇది సమయం కాదని... రెండో విడత వ్యాక్సినేషన్‌ తర్వాత ఎన్నికలు నిర్వహించుకోవాలని సూచించారు. ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించలేమని.. తమ ప్రాణాలకు భరోసా ఇస్తారా అంటూ ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి ప్రశ్నించారు.

Tags:    

Similar News