Amzath Basha Shaik Bepari: టీడీపీ నేతలు బుద్ధి మార్చుకోవాలి

Amzath Basha Shaik Bepari: టీడీపీ తమపై ఉద్దేశ పూర్వకంగానే ఆరోపణలు చేస్తోంది

Update: 2024-03-04 15:15 GMT

Amzath Basha Shaik Bepari: టీడీపీ నేతలు బుద్ధి మార్చుకోవాలి 

Amzath Basha Shaik Bepari: కడప నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నా.. టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగానే తమపై ఆరోపణలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఆరోపించారు. మాసాపేట సర్కిల్ వద్ద నూతనంగా నిర్మించిన తొలిగడప గోపురం సర్కిల్‌ను మేయర్ సురేష్ బాబుతో కలిసి ఆయన ప్రారంభించారు. గతంలో ఎన్నడు లేనివిధంగా కడపలో రోడ్ల విస్తరణ, డ్రైనేజీ నిర్మాణం, తాగునీటి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టామని అంజాద్ బాషా అన్నారు. ఎంత అభివృద్ధి చేస్తున్నా టీడీపీ నేతలు తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు బుద్ధి మార్చుకోవాలని హితవు పలికారు.

Tags:    

Similar News