ప్రకాశం జిల్లాలో విషవాయువు లీక్.. 17 మంది సిబ్బందికి అస్వస్థత

Prakasam: చికిత్స కోసం ఒంగోలు రిమ్స్ కి తరలింపు

Update: 2023-07-05 07:59 GMT

ప్రకాశం జిల్లాలో విషవాయువు లీక్.. 17 మంది సిబ్బందికి అస్వస్థత 

Prakasam: ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలంలోని మున్నంగి సి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో విషవాయువు లీక్ అయ్యింది. దీంతో కంపెనీలో పనిచేస్తున్న 17 మంది సిబ్బందికి అస్వస్థతకు గురయ్యారు. మున్నంగి సీ ఫుడ్స్ లో ఫ్రాన్స్ ప్రాసెసింగ్ చేసే క్రమంలో ఉపయోగించే ద్రావకాలు లీకేజ్ కావడంతో ఆ వాసనకు కార్మికులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది. కుప్పకూలిన కార్మికులను సిబ్బంది ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

Tags:    

Similar News