జనసేనాని పవన్కల్యాణ్ వ్యాఖ్యలకు వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. జనసేన జెండాలు పట్టుకొని టీడీపీ కార్యకర్తలు కన్పించారే కానీ భవన నిర్మాణ కార్మికులు ఎక్కడా కన్పించలేదని ఎద్దేవా చేశారు. భవన నిర్మాణ కార్మికుల గురించి ఆలోచించే చిత్తశుద్ధి పవన్కు లేదని విమర్శించారు. పవన్కల్యాణ్పై వ్యక్తిగత ద్వేషం లేదన్న అంబటి రాంబాబు ఎవరి కోసం పార్టీ పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు.
పవన్ కల్యాణ్ కన్ఫ్యూజన్, స్పష్టత లేని రాజకీయాలు చేస్తున్నారు. ఆయన ఇంతవరకు ఏం పోరాటం చేశారో చెప్పాలి. పార్టీనీ నడిపించలేక పోతే సినిమాలు చేసుకోండి. పవన్ ముమ్మాటికీ చంద్రబాబు దత్తపుత్రుడే. బాబు తప్పులు చేసినా ఆయన ప్రశ్నించడం లేదు. టీడీపీ గెలిచిన సీట్లు 23 కాదు, 24 అని తేలిపోయింది. వరదలు తగ్గగానే 10 రోజుల్లో ఇసుక కొరత తీరుస్తాం' అని అంబటి అన్నారు.